తాండలల్లో తాగునీటి తండ్లాట

5084చూసినవారు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లోని బాసుతండా గ్రామ పంచాయతీకి కొద్ది రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో పాటు తాగునీటి బావికి ఉన్న మోటర్ ఐదు రోజుల క్రితం కాలిపోవడంతో తండా ప్రజలు నీళ్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదని వాపోతున్నారు. ఎండాకాలం కావడంతో తాండలల్లో తాగునీరు లేక పొలాల వద్దకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్