ఘనంగా మసీదులలో షబ్-ఎ-ఖద్ర్ వేడుకలు

558చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి, పెరుమాండ్ల సంకీస, చిలుకోడు, బంజారా, తోడేళ్ళగూడెం గ్రామాలలోని మసీదులలో శనివారం రాత్రి షబ్-ఎ-ఖద్ర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంజాన్ మాసంలో చివరి ఐదు బేసి రాత్రుల్లో ముఖ్యమైన రాత్రి అని, పవిత్ర ఖురాన్ అవతరించిన రాత్రి అని ముస్లింలు అన్నారు. ఈ రాత్రి అంతా ముస్లింలు జాగారం ఉండి ప్రత్యేక ఖురాన్ ను భక్తి, శ్రద్ధలతో పూర్తి చేశారు. ఈ సందర్బంగా హఫీజ్ సాబ్లను సన్మానించారు.

సంబంధిత పోస్ట్