డోర్నకల్ మండలం ముల్కలపల్లి తిరుపతమ్మ - గోపయ్య స్వామి ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో మంటలు చెలరేగాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారా. ప్రమాదవశాత్తు జరిగిందా తెలియాలి. స్థానికులు హుటా హుటీనా మంటలను ఆర్పి అర్చకులుకి సమాచారం అందించారు. ఎవరో కావాలనే చేశారని, మంట పక్కనే గ్యాస్ ఉండటంతో మంటలను ఆర్పక పోతే గ్యాస్ పేలేదేనని, అర్చకులు రమూర్తి తెలిపారు. రూ. 3వేలు ఆస్తి నష్టం జరిగిందన్నారు.