జనగామ మండలంలోని గానుగపహడ్ గ్రామంలో 4వ తరగతి విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంపత్ (11) నాల్గవ తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. సంపత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంపత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.