ఓటర్ సమాచార స్లిప్పుల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు తెలిపారు. బుధవారం హైదరాబాదు నుండి రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్, ఎలక్షన్ కమిషనర్ లు సర్పరాజ్, లోకేష్ కుమార్ లు పార్లమెంట్ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జనగాం జిల్లా కలెక్టర్ తదితర అధికారులతో కల్సి పాల్గొన్నారు.