గ్రామాల్లో తాగునీటి సరఫరా నిరంతరం చేయాలి

73చూసినవారు
గ్రామాల్లో తాగునీటి సరఫరా నిరంతరం చేయాలి
వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం చేయవద్దని జనగాం జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. శనివారం జనగాం జిల్లాలోని గోపాల్ నగర్, గండిరామారం, బొమ్మకూర్ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, ఉపాధి హామీ పనులు పరిశీలించారు. అనంతరం బచ్చన్నపేటలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్