జనగాంలో ఘనంగా కాన్షిరాం వర్ధంతి

81చూసినవారు
జనగాంలో ఘనంగా కాన్షిరాం వర్ధంతి
బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షిరాం 18వ వర్ధంతిని జిల్లా కేంద్రమైన జనగాం నగరంలో జిల్లా అధ్యక్షులు మడిపడిగ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం నాయకులు రత్నం, సిద్దయ్యలతో కల్సి
కాన్షిరాం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో 85 శాతంగా ఉన్న బహుజనులు తమ ఓటు తామే వేసుకుంటే రాజకీయ అధికారం హస్తగతమౌతుందన్నారు.

సంబంధిత పోస్ట్