మొండ్రాయి చెక్ పోస్ట్ వద్ద లక్షల రూపాయలు స్వాధీనం

57చూసినవారు
మొండ్రాయి చెక్ పోస్ట్ వద్ద లక్షల రూపాయలు స్వాధీనం
జనగాం జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి చెక్ పోస్ట్ వద్ద చేసిన తనిఖీలో హైదరాబాద్ నుండి తిరుమలగిరికి వెళ్తున్న పాత బ్యాటరీల టాటా ఏసీ వాహనంలో మూడు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. శనివారం టీఎస్ 08 1688 నంబర్ గల వాహనంలో జాన రాకేష్ కుమార్ అనే డ్రైవర్ వద్ద నుండి డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో కొడకండ్ల ఎస్సై శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్