కోమటి రెడ్డి వెంకట రెడ్డిని కాంగ్రేస్ పార్టీ నుండి బహిష్కరించాలి

7240చూసినవారు
బీసీ నేత చెరుకు సుధాకర్ పైన అనుచిత వాక్యాలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి ఎల్హెచ్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గుగులోతు హరి నాయక్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా స్థానిక అంబేద్కర్ సెంటర్ లో బహుజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీ నేత చెరుకు సుధాకర్ గౌడ్ కమారుడుకి ఫోన్ చేసి నిన్ను చంపేస్తా, మీ నాన్నను చంపేస్తా, హాస్పటల్ ను కూల్చివేస్తాం అంటూ బెదిరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించి, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రజా సంఘాల నాయకులు కోరారు. తక్షణమే 52 శాతం ఉన్న బీసీలు రేపు(సోమవారం) తెలంగాణ అంతట కోమటిరెడ్డి వెంకటరెడ్డి శవయాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీసీ లకు అండగా లంబాడీలు, ఆదివాసులు, దళితులు, అండగా ఉంటామని ధైర్యం ఇచ్చారు. తెలంగాణ తిరుగుబాటు రాష్ట్రమని, ప్రశ్నించే రాష్ట్రమని, ఎదిరించే రాష్ట్రమని, రెండు శాతం ఉన్న ఓసీలు అందులో వెంకటరెడ్డి కుటుంబం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. పాత గడిల రాజకీయాలు కావని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిజెపిలో చేరడానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఈ రాష్ట్రంలో తీసుకురావాలని కుట్ర చేస్తున్నారని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పిచ్చి లేసిందని, పిచ్చి హాస్పిటల్ కు వెళ్లి చూపించుకోవాలన్నారు. తక్షణమే క్షమాపణ కోరాలని లేనిచో రాష్ట్రమంతటా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పీరయ్య మాదిగ, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోతు భీమా నాయక్ ఎంపీటీసీ ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు సంపంగి రామచంద్రు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్