అంగన్వాడీలను ముందస్తుగా అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని మంగళవారం అంగన్ వాడీలు వాపోయారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల అంగన్ వాడీలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో అదుపులో ఉంచడం ప్రభుత్వం యొక్క నిరంకుశ పరిపాలనకు నిదర్శనం అని సీఐటీయూ మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ అన్నారు.