ములుగు జిల్లాలో అరుదైన పాము.. యాక్సిడెంట్ లో మృతి

10125చూసినవారు
ములుగు జిల్లాలో అరుదైన పాము.. యాక్సిడెంట్ లో మృతి
ములుగు జిల్లా ఏటూరునాగారం కమలాపురం మద్యలో ఉన్న జీడివాగు వద్ద సోమవారం అరుదైన బంగారస్ అనే పాము యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఇటువంటి పాము ఈ ఏరియాలో చూడడం ఇదే మొదటిసారని వాహనదారులు తెలిపారు. బంగారస్ అనేది ఆసియాకు చెందిన ఎలాపిడ్ల జాతి. దక్షిణ, ఆగ్నేయాసియా, దక్షిణ చైనాలోని ఉష్ణ మండల అడవుల నేలపై తరచుగా కనిపిస్తాయని, ఇవి మధ్యస్థ పరిమాణ, అత్యంత విషపూరిత పాములని పశువైద్యులు తెలిపారు. ఇవి ఇతర పాములను వేటాడతాయి.

సంబంధిత పోస్ట్