ముందుబాబులకు అడ్డాగా వ్యవసాయ శాఖ గోడౌన్

1061చూసినవారు
ములుగు జిల్లా మంగపేట మండలం గంపోనిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటి గోడౌన్ మందుబాబులకు అడ్డాగా మారింది. రాత్రివేళల్లో మద్యం సేవించి, సీసాలను విచ్చలవిడిగా అక్కడే పారేసి, పగలగొట్టి వెళ్తున్నారని శనివారం రైతులు ఆరోపిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు. మార్కెట్ యార్డుకు నిత్యం రైతులు వస్తుంటారు. పగిలిన సీసాలు గుచ్చుకునే ప్రమాదం ఉంది.

సంబంధిత పోస్ట్