అడవిని కమ్మేస్తున్న కార్చిచ్చు... ఆపదలో వన్య ప్రాణులు

3599చూసినవారు
వేసవికాలం మొదలవడంతో ఏజెన్సీలోని అటవీ ప్రాంతాలు కార్చిచ్చు ముంపుకు గురవుతున్నాయి. వన్యప్రాణుల ప్రాణాలకు సైతం కార్చిచ్చు కారణంగా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా ఏటూరునాగారం, పస్రా జాతీయ రహదారిపై పొగ కమ్మేసి వాహనదారుల ప్రయాణాలకు సైతం ఇబ్బందిగా మారింది. తాజాగా బుధవారం ఉదయం కార్చిచ్చుతో అడవి కాలిపోతుంది. అటవీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రకృతి ప్రేమికులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్