ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. ఇదిలా ఉండగా పలుచోట్ల వరి రైతులు కోతలు కోసి ధాన్యం కల్లాల్లో ఆరబెట్టగా, మరికొన్ని చోట్ల వరికోత దశలో ఉన్నాయి. దీంతో నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.