ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ములుగు మండలంలోని మల్లంపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఆలయపై కప్పు యొక్క పెచ్చు ఊడి పడింది. దీంతో ఆలయానికి దైవ దర్శనం కోసం వచ్చే భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎండోమెంట్ అధికారులు తక్షణమే స్పందించి ఆలయ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు.