మావోయిస్టు ఏసిఎం ఏరియా కమిటి సభ్యురాలు లొంగుబాటు

81చూసినవారు
మావోయిస్టు ఏసిఎం ఏరియా కమిటి సభ్యురాలు లొంగుబాటు
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ ఎదుట బుధవారం మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు పోడియం సోమిడి లొంగిపోయింది. ఏఎస్పీ వివరాల ప్రకారం.. సమ్మయ్య అనే మావోయిస్టు కమాండర్ ప్రోద్బలంతో 2019లో మిలీషియాలో చేరింది. 2023 జూన్ లో ఏరియా కమిటి సభ్యురాలుగా హోదా పొంది అదే సమయంలో ఇన్సాస్ రైఫిల్ ను మోసింది. సోమిడిపై రూ. 4 లక్షల రివార్డు ప్రకటించారని, ఆమె పలు ఎన్ కౌంటర్లలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్