ఎన్కౌంటర్ తో అప్రమత్తమైన ములుగు జిల్లా పోలీసులు

1562చూసినవారు
వెంకటాపురం సరిహద్దు ప్రాంతంలో ములుగు జిల్లాలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో ములుగు జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. వాజేడు, వెంకటాపురం మండలాల్లో 163 జాతీయ రహదారిపై తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. పేరూరు ఎస్సై రమేష్, వాజేడు ఎస్సై వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో ప్రయాణికుల బ్యాగులు, గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్