ఏటూరునాగారం మండలంలో మరోసారి పెద్దపులి కలకలం

78చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఏటూరు నాగారం మండలంలోని రాంనగర్ గ్రామానికి చెందిన కొంరయ్య గురువారం తన వరి పంటకు మందు చల్లడానికి వెళ్లాడు. ఈ క్రమంలో తన పంట చేను గట్టుపై పెద్దపులి పడుకొని ఉందని, దానిని చూసి భయపడి గ్రామానికి వచ్చినట్లు కొంరయ్య తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి ఆనవాళ్లు వెతుకుతున్నారు.

సంబంధిత పోస్ట్