ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ములుగు డీఎస్పీ రవీందర్

76చూసినవారు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ములుగు డీఎస్పీ రవీందర్
భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ములుగు డీఎస్పీ రవీందర్ తెలిపారు. ములుగు పరిధిలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. రాళ్ళవాగు బ్రిడ్జి తెగిపోవడంతో ఘన్ పూర్ వెళ్లేవారు అబ్బాపూర్ లేదా వెంకటాపూర్ మీదుగా వెళ్లాలన్నారు. బొగ్గులవాగు మీదుగా జగ్గన్నగూడెం వెళ్లేవారు సర్వాపూర్ నుండి హై లెవెల్ బ్రిడ్జి గుండా అంకన్నగూడెం ద్వారా జగ్గన్నగూడెంకు వెళ్లాలని డీఎస్పీ రవీందర్ సూచించారు.

సంబంధిత పోస్ట్