జీడివాగు సమీపంలో పులి సంచరిస్తుందంటూ ప్రచారం

58చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జీడివాగు సమీప ప్రాంతాల్లో పులి సంచరిస్తుందంటూ సోమవారం రాత్రి ప్రచారం జరిగింది. ఓ లారీ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మండలంలోని జీడివాగు వద్ద ఓ లారీ డ్రైవర్ పెద్దపులిని చూశానని అటవీశాఖ అధికారుల వద్దకు వచ్చి తెలిపాడు. దీంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు సుమారు 2 గంటల పాటు అటవీ ప్రాంతంలో టార్చిలైట్ల ద్వారా వెతకగా ఎక్కడ ఆచూకీ లభించలేదు.

సంబంధిత పోస్ట్