ఉగ్ర గోదావరి వరదకు.. ఇసుక బస్తాలు ఆగేనా..?

69చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం సమీపంలోని గోదావరి కరకట్ట పలుచోట్ల కోతకు గురైంది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు బస్తాల్లో ఇసుకను నింపి కోతకు గురైన చోట అడ్డుగా అమర్చారు. అయితే ఇసుక బస్తాలు భారీ వరదలకు ఆగుతాయా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం భారీగా వచ్చిన వరదలకు సపోర్టుగా ఏర్పాటు చేసిన బండరాళ్లు ఊడిపోయాయి. కాగా, ఇసుక బస్తాల ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్