ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి

60చూసినవారు
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెహ్రూ సెంటర్లో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
సమాజంలో అణిచివేతకు, అవకాశాలకు దూరమై కుల వివక్షతను ఎదుర్కొనే దళిత బహుజన వర్గాలకు ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. కార్యక్రమంలో ప్రణయ్ దీప్, గుంటి వీరప్రకాష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్