తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాదని, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తదుపరి ప్రధాని అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అశాభావం వ్యక్తం చేశారు. మూడు సార్లు ఆమె విజయవంతంగా సీఎం బాధ్యతలు నిర్వర్తించడం కూడా మమతకి కలిసివస్తుందని చెప్పారు.