నల్లబెల్లిలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

577చూసినవారు
నల్లబెల్లిలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లి మండలం కొండాయిల్ పల్లి గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం స్థానికులు మాట్లాడుతూ అప్పుల బాధతో రాధారపు రాజన్న అనే రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రాజన్న మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, వారి అంతిమ యాత్రలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్