ఉరుములతో, ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన గోలి కృష్ణారెడ్డికి చెందిన గేదె పిడుగుపాటుకు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఆకస్మిక సంఘటనలో దాదాపు 45 వేల రూపాయలు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.