తెలుగు ఉపాధ్యాయురాలిని ఘనంగా సన్మానించిన బీఎస్పీ నాయకులు

1570చూసినవారు
తెలుగు ఉపాధ్యాయురాలిని ఘనంగా సన్మానించిన బీఎస్పీ నాయకులు
పాలకుర్తి మండలం కేంద్రంలో వెలుగు పాఠశాలలో స్థానిక బీఎస్పీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. వెలుగు పాఠశాలలో తెలుగు బోధిస్తున్న టీచర్ క్రిష్ణవేణి మేడంను బీఎస్పీ నాయకులు ఘనంగా సన్మానించారు. అట్టడుగు స్థాయి నుంచి చదువుపట్ల ఆసక్తితో ఓపెన్ డిగ్రీ చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించినటువంటి తెలుగు ఉపాధ్యాయురాలు క్రిష్ణవేణి నేటి మహిళలకు ఆదర్శం అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్