కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించండి: ఎమ్మెల్యే యశస్విని

75చూసినవారు
కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించండి: ఎమ్మెల్యే యశస్విని
వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రజలను కోరారు. గురువారం సాయంత్రం పాలకుర్తి మండలం కొండాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. తొలిసారిగా కొండాపురం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ గడ్డం యాకసోమయ్య, మంగ శోభన్ బాబు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.

సంబంధిత పోస్ట్