గ్రామాల్లో ఘనంగా జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు

288చూసినవారు
గ్రామాల్లో ఘనంగా జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు
వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో ఘనంగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. శుక్రవారం ఉదయం కాట్రపల్లి గ్రామ పంచాయితీ ఆవరణలో గ్రామ సర్పంచ్ శ్రీ పూలుగు సాగర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ గాయపు ప్రచూర్ణ-భాస్కర్ రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీమతి జెల్లిక రజిత-ఐలయ్య, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, పంచాయితీ సెక్రటరీ ప్రభుత్వ ఉపాద్యాయులు, మహిళ సంఘ సభ్యులు, అంగన్వాడి టీచర్స్, ఆశ కార్యకర్తలు, యువకులు, గ్రామస్తులు, మరియు అన్ని పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్