గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం రేపు ఉగాది సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు పురుషోత్తమచారి, కమిటీ సభ్యులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో ఉగాది పంచాంగ శ్రావణం తెలపడం జరుగుతుందన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.