పాతకక్ష్యలతో దారుణ హత్య

14264చూసినవారు
పాతకక్ష్యలతో దారుణ హత్య
వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం కేంద్రంలో దారుణ హత్య జరిగింది. పాతకక్ష్యలతో ఒకరిని దారుణ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన చింత అశోక్ రేషన్ దుకాణం వద్ద బియ్యం తీసుకుంటున్నాడు. ఈ సమయంలో ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అతనిపై కర్రలతో దాడి చేశారని అన్నారు. ఈ దాడిలో అశోక్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనితో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కాజీపేట్ ఏసీపి రవీంద్ర కుమార్, ధర్మసాగర్ సీఐ రమేష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించామని చెప్పారు. నిందితులు పరారీలో ఉన్నారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ రవీంద్ర కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్