బాధితురాలికి ఆర్థిక సహాయం

687చూసినవారు
బాధితురాలికి ఆర్థిక సహాయం
ఖిల్లా వరంగల్ పడమరకోటకు చెందిన గజ్జెల కుమారస్వామి కుమార్తె అంబటి రమాదేవి గత కొన్ని రోజుల నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వాక్ సమాక్య ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్. వన్నాల వెంకటరమణ చికిత్స నిమిత్తం రూ. 15 వేలు ఆర్థిక సహాయాన్ని గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, ఇనుముల అరుణ్, గోవింద్ సింగ్, ఎల్లబోయిన చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్