త్వరలో జరగబోవు లోక్ సభ ఎన్నికల నిర్వహణను దృష్టిలో ఉంచుకొని ఎనుమాములలోని స్ట్రాంగ్ రూమ్ లోని ఈవీఎంలను ఏఆర్ఓ, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఆర్ఓ మాట్లాడుతూ.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నేతృత్వంలో వచ్చే నెల మూడవ తేదీన మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేయడంతో పాటు నాలుగవ తేదీన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచామన్నారు.