వేసవి కాలం దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు వైద్య సేవలను అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండ జిల్లా పరకాలలోని సామాజిక వైద్యశాలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వేసవిలో వడగాడ్పుల ప్రభావం ఉండే నేపథ్యంలో సామాజిక ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో కలెక్టర్ మాట్లాడారు. ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.