ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో మంగళవారం ఉగాది సందర్భంగా వసంత నవాత్రులలో మొదటి రోజు లక్ష గులాభిలతో పుష్పార్చన కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు అమ్మవారిని అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషు అమ్మవారి ప్రత్యేక అలంకరణ అనంతరం మహా హారతి అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.