ఘనంగా బాలల దినోత్సవం

56చూసినవారు
ఘనంగా బాలల దినోత్సవం
వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలుమండలంలో నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ ఒంటిమామిడిపల్లి పాఠశాల యందు ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి ఆధ్వర్యంలో సర్పంచ్ ఆడెపు దయాకర్, ఎంపీటీసీ కద్దూరి రాజు, ఉప సర్పంచ్ కొట్టం రాజు, చైర్మన్ గోనె రమ, ఎస్ఎంసి సభ్యులు ఉపాధ్యాయులు కలిసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. విద్యార్థులు చాచా నెహ్రూ గొప్పతనాన్ని తెలుపుతూ.. విద్య యొక్క ప్రాధాన్యత తెలుపుతూ.. ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యత తెలుపుతూ వివిధ జానపద గీతాలతో విద్యార్థులను తల్లిదండ్రులను గ్రామస్తులను అలరించారు. అత్యధిక ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్