కేంద్రంలో తమ సర్కారు హ్యాట్రిక్ కొట్టునున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. లోక్సభ ఎన్నికల సరళి ముగుస్తున్న కొద్దీ.. ఇండియా కూటమి పేకమేడలా కూలుతోందని విమర్శించారు. తాము ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వంలో పేద, యువత, మహిళలు, రైతుల కోసం నిర్ణయాలను తీసుకోనున్నట్లు చెప్పారు. యూపీలోని బారాబంకిలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి మాత్రం దేశంలో అస్థిరత సృష్టిస్తోందని విమర్శించారు.