ఓ కానిస్టేబుల్ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.40 లక్షలు కాజేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న చట్ల ఆంజనేయులు సెల్ ఫోనుకు మే 30న ఆధార్ కార్డు నెంబర్తో సహా ఓటీపీ వచ్చింది. మే 31న సిమ్ పనిచేయటం లే
దని కస్టమర్ కేర్కు ఫోన్ చేసి తెలుసుకోగా సిమ్ బ్లాక్ అయినట్లు తెలిపారు. కొత్త సిమ్ కార్డును తీసుకోగా జూన్ 5న యాక్టివేషన్ అయింది. అయితే అప్పటికే తన ఖాతా నుంచి రూ.1.40 లక్షలు డ్రా అయినట్లు తెలిసింది.