దేశీయ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ కొత్త వ్యాపార విభాగంలోకి అడుగుపెట్టింది. పునరుత్పాదక ఇంధన సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీనికోసం స్టార్టప్ ఎనర్జీని లాంచ్ చేసినట్లు కంపెనీ బుధవారం వెల్లడించింది. ఈ కొత్త విభాగం ద్వారా సోలార్ ప్యానెల్ తయారీలోకి మైక్రో మ్యాక్స్ ఎంట్రీ ఇవ్వనుంది. గతంలో దేశీయ స్మార్ట్ఫోన్ విభాగంలో ఈ సంస్థ ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే.