వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

81చూసినవారు
వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి తన వంద రోజుల పాలనకు రెఫరెండంగా తీసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారని, కానీ కాంగ్రెస్‌పై ఆరు నెలల్లోనే ప్రజలకు నమ్మకం పోయిందనేది ఈ ఫలితాలతో రుజువైందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు రెఫరెడంగా చెప్పుకున్న సీఎం ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణ‌లో బీజేపీ పెరుగుద‌ల స్పష్టంగా క‌నిపిస్తోందని, ఇది మోదీ చరిష్మా వల్లే సాధ్యమైందన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్