లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ ప్రారంభమైనాటినప్పటి నుంచి ఇలాంటివి ఎన్నో చూశామన్నారు. నేటి ఫలితాలు చాలా నిరాశకు గురిచేశాయి. కానీ మేము శ్రమిస్తాము, మళ్ళీ జీరో నుంచి ఫీనిక్స్ పక్షిలాగా పైకి లేస్తామని ట్వీట్ చేశారు.