ఓటేసిన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జి.. Video

82చూసినవారు
పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జి లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోల్‌కతాలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఆమె ఓటు వేశారు. అంతకు ముందు పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ఉన్న జనాలతో మమత మాట్లాడారు. అనంతరం పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఆమె ఓటువేశారు. ఆ తర్వాత బయటికి వచ్చి ప్రజలకు విక్టరీ సింబల్‌ చూపించారు. లోక్‌సభ చివరి విడత పోలింగ్‌లో భాగంగా ఇవాళ పశ్చిమబెంగాల్‌లోని 9 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది.

సంబంధిత పోస్ట్