డైనోసార్ల లాగే కాంగ్రెస్ పార్టీ మరికొన్నాళ్లలో అంతరించిపోతుందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జోస్యం చెప్పారు. ఉత్తరాఖండ్లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్లో అంతర్గత పోరు రియాల్టీ షో ‘బిగ్బాస్’ని తలపిస్తుందని విమర్శించారు. ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ను విడిచి బీజేపీలో చేరుతున్నారన్నారు. 2024 తర్వాత కొన్నేళ్లలోనే కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని పిల్లలు అడుగుతారని తెలిపారు.