తెలంగాణలో లోక్ సభ ఎన్నికల తుది పోలింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. రాష్ట్రంలో పోలింగ్ శాతం 65.67శాతానికి పెరిగినట్లు తెలిపారు. అత్యధికంగా భువనగిరిలో 76.78శాతం పోలింగ్ నమోదైందని.. అత్యల్పంగా HYDలో 48.48శాతం నమోదైనట్లు ప్రకటించారు. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 84.25శాతం, మలక్పేట అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్పంగా 42.76శాతం నమోదైందని చెప్పారు. 2019 LS ఎన్నికలతో పోలిస్తే 3శాతం పోలింగ్ పెరిగిందన్నారు.