కేసీఆర్ చేసింది 100శాతం కరెక్ట్ : మాజీ మంత్రి

60చూసినవారు
కేసీఆర్ చేసింది 100శాతం కరెక్ట్ : మాజీ మంత్రి
విద్యుత్ కొనుగోళ్లలో కేసీఆర్ చేసింది 100శాతం కరెక్ట్ అని తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జస్టీస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ చేసే అర్హత కోల్పోయిందన్నారు. తెలంగాణకు నష్టం వాటిల్లే పనిని కేసీఆర్‌ ఎన్నడూ చేయరని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారంపై కమిషన్‌ వేసిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్