AP: రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. 'అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20వేలు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 6వేలతో కలిపి ఈ నగదు జమ చేస్తాం. ఏపీ వెబ్ల్యాండ్ ప్రకారం 43 లక్షల మంది పీఎం కిసాన్ పొందుతున్నారు. వీటితో పాటు, మే నెలలో 9-10 లక్షల మంది రైతులకు ఈ డబ్బును జమ చేస్తాం. బడ్జెట్లో రూ.6300 కోట్లు కేటాయించాం' అని ఆయన ప్రకటించారు.