భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. వారు వారం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉంటారు. వారిద్దరూ బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో మే 6న నింగిలోకి పయనం కానున్నారు.