పాక్ ఆక్రమిత కశ్మీర్లోని శక్స్గామ్ లోయలో ఇటీవల చైనా అక్రమ నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్ తీవ్రంగా నిరసించింది. పాకిస్థాన్ శక్స్గామ్ లోయను 1963లో చైనాకు అప్పగించింది. 1963లో ఇస్లామాబాద్, బీజింగ్ల మధ్య కుదిరిన ఒప్పందంలో ఆరో అధికరణ కీలకమైంది. కశ్మీర్పై భారత్, పాక్లు ఒక అంగీకారానికి వస్తే శక్స్గామ్పై తిరిగి చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆ అధికరణం పేర్కొంది.