ఓ వ్యక్తికి బంతి బలంగా తాకి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ముంబైలోని దాద్కర్ మైదానంలో వెలుగుచూసింది. బ్యాటర్ కొట్టిన బంతి వేగంగా వచ్చి తలను తాకడంతో జయేశ్ సావ్లా అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. 50 ఏళ్లకు పైబడినవారు కుచ్చీ
వీసా ఓస్వల్ వివాస్ లెజెండ్కప్ ఆడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఇందులో ఎలాంటి కుట్ర లేదని స్థానిక పోలీసులు తెలిపారు.