గోదావరి ఇతివృత్తంగా ఓ సినిమా చేస్తే బాగుంటుదనుకున్నారు శేఖర్. కొన్ని సీన్లు, పాత్రల తీరు గురించి హీరోయిన్ కమలినీ ముఖర్జీకి చెప్పగా ఫిదా అయ్యి నేనే హీరోయిన్గా నటిస్తా అని అడిగారు. ’ఆనంద్‘ రిలీజ్ తర్వాత శేఖర్ చూద్దామన్నారట. ఆ చిత్రం విజయం సాధించింది. దీంతో గోదావరి మూవీ పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, గోపీచంద్. వీరిలో ఎవరో ఒకరితో సినిమాని తెరకెక్కించాలని అనుకున్నారట. అందరూ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఆ అవకాశం సుమంత్కి దక్కింది.