రైతు భరోసాకు కాంగ్రెస్ మంగళం పాడనుందా..?

64చూసినవారు
రైతు భరోసాకు కాంగ్రెస్ మంగళం పాడనుందా..?
తెలంగాణ‌లో రైతుభరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వర‌రావు ఇటీవ‌ల ఓ ప్రకటన చేశారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతు భరోసా సాయం ఇవ్వడంలేదని చెప్పారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఒక్కసారిగా అసంతృప్తి కనిపించింది. మొన్నటి వరకు ఇస్తాం అంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఒక్కసారిగా చేతులెత్తేయడంతో వారిలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. రైతు భ‌రోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడనుందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్